భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త..?

author img

By

Published : Nov 16, 2022, 10:47 PM IST

dd

Husband killed his wife: కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని పెళ్లి చేస్తే, చేసుకున్నోడే ప్రాణం తీశాడు. ఈ ఘటన హనుమకొండజిల్లాలో చోటుచేసుకుంది. తన కూతురుని భర్తే హత్యచేసి ఆత్మహత్యలా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

Husband killed his wife: కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడని పెళ్లి చేస్తే, చేసుకున్నోడే ప్రాణం తీశాడు. ఈ ఘటన హనుమకొండజిల్లా పరకాలలో చోటుచేసుకుంది. కాపాడాల్సిన భర్తే కాలయముడిలా మారడంతో ఆ మహిళ మృత్యువాత పట్టింది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణానానికి చెందిన పొడిశెట్టి రవిచంద్ర చారీ, పావని దంపతులు తమ ఇద్దరి పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్నారు.

వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. పెద్దమనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయితీలు జరిగినా..ప్రయోజనం లేకుండా పోయింది. దానితో తన కూతురుని అల్లుడు హైదరాబాద్‌లోని వాళ్ల ఇంట్లో ఉరివేసి చంపి ఆత్మహత్యలా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి వాపోయాడు. ఈ విషయాన్ని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.