శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

author img

By

Published : Jan 11, 2022, 8:52 PM IST

Updated : Jan 11, 2022, 9:39 PM IST

Shamshabad airport

20:49 January 11

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ.. ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి 1481.10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన మహిళల నుంచి 991 గ్రాములు, 168.5 గ్రాములు, 321.60 గ్రాముల చొప్పున బంగారం గుర్తించినట్లు చెప్పారు. మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.72.80 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీచూడండి: Live Video: కరీంనగర్‌లో భారీ వర్షం.. కూలిన 70 అడుగుల ఎత్తైన లుమినార్‌

Last Updated :Jan 11, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.