విద్యార్థినుల మధ్య ఘర్షణ.. శానిటైజర్​ తాగి ఐదుగురి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Nov 20, 2022, 11:03 AM IST

Updated : Nov 20, 2022, 1:58 PM IST

sanitizer

10:54 November 20

విద్యార్థినుల మధ్య ఘర్షణ.. శానిటైజర్​ తాగి ఐదుగురి ఆత్మహత్యాయత్నం

girls drink sanitizer in hanumakonda: విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న ఘర్షణ చివరకు ఆత్మహత్యకు దారి తీసిన ఘటన ఉమ్మడి వరంగల్​ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండలోని ఆరెపల్లి కస్తూర్భా గాంధీ బీసీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో అందులో ఐదుగురు విద్యార్థినులు మనస్తాపానికి గురై హాస్టల్​లో ఉన్న శానిటైజర్​ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు గమనించి హాస్టల్​ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హాస్టల్​ సిబ్బంది వచ్చి వారిని హుటాహుటిన వరంగల్​లోని ఎంజీఏం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యం అందిస్తోన్న వైద్య సిబ్బంది వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 20, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.