ఈ దొంగల టార్గెట్​ ఖరీదైన బైకులే.. మీ టూవీలర్ జాగ్రత్త సుమీ!

author img

By

Published : Nov 17, 2022, 10:52 PM IST

Four thieves were arrested for bike theft in hyderabad city

Bike thieves arrested in hyderabad: ఈ దొంగల టార్గెట్​ భారీ విలువ చేసే బైకులు మాత్రమే.. చిన్నచిన్న బైకుల జోలికి అసలు వెళ్లరు. లక్ష రూపాయలకు పైగా ఉన్నవాటిని మాత్రమే దొంగలించేందుకు టార్గెట్​ చేస్తారు. ఇలా ఈ దొంగలు రూ.20లక్షలు విలువ చేసే 14 బైకులను దొంగలించారు. ఇంతవరకూ బాగానే ఉంది అసలు ట్విస్ట్​ ఇక్కడే ఉంది.. ఏంటో మీరే చూడండి?

Bike thieves arrested in hyderabad: ఈ యువ దొంగల టార్గెట్​నే ఎక్కువ ఖరీదు చేసే స్పోర్ట్స్​, రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైకులు మాత్రమే.. వీళ్లని యువ దొంగలు ఎందుకు అన్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీరి ఒక్కొక్కరి వయస్సు 23 సంవత్సరాలు లోపే.. వీరు స్పాట్​ పెడితే కచ్చితంగా బైక్​ మాయం కావాల్సిందే.. ఎలా అంటారా.. ఒకడు కీ లేకుండా కేవలం కాలితోనే బైక్ తాళం తీస్తాడు..

వికారాబాద్​ జిల్లా పరిగి పట్టణానికి చెందిన శ్రీకాంత్​, రఘులు.. ముజాహిద్​పూర్​కు చెందిన రమేశ్​.. సుల్తాన్​పూర్ చెందిన లక్కీ అనే ఈ నలుగురు యువకులు బైక్​ దొంగతనాలకు పాల్పడుతుంటారు. ​అనేక బైకులను దొంగలించారు కానీ ఎక్కడా దొరకలేదు.. దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే కదా! అలాగే దొరికిపోయాడు ఈ యువకులలో ఒక యువకుడు. కుల్కచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి తన బుల్లెట్​ బండిని దొంగలించి పారిపోతూ ఉండగా.. పరిగి పట్టణంలో ప్రమాదానికి గురై తీవ్రగాయాలు కావడంతో పరిగి ​ పోలీసులు హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించారు.

ఆ దొంగ తెచ్చిన బైక్​ యజమానికి ఫోన్​ చేసి తమ వాహనం తీసుకొని వెళ్లాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడే అసలు విషయం బయటపడింది. తన బుల్లెట్​ వాహనాన్ని నిన్న ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఆ యజమాని చెప్పాడు. ఈ విషయంపై కుల్కచర్ల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని పోలీసులకు మొత్తం వివరాలు తెలిపాడు. దీంతో యువకునిపై అనుమానం వచ్చి ఈ విషయంపై ఆరా తీశారు. ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో బుల్లెట్​ దొంగను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

ఈ యువకునితో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని తేలింది. ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా 14 బైక్​లను దొంగలించామని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.20లక్షలుగా ఉంటుంది. ఈ మొత్తం బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు నలుగురు తమ అదుపులో ఉన్నారని, వీరి ఒక్కొక్కరి వయసు 23 సంవత్సరాలు లోపే ఉంటుందని డీఎస్పీ కరుణాసాగర్​రెడ్డి తెలిపారు. ఈ నలుగురు దొంగలలో ఒక యువకుడు బైక్​ తాళాలు ఏవిధంగా తీస్తారో వివరించాడు. ఈ యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్​కి తరలించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకొని బైక్​లను స్వాధీనం చేసుకొన్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.

బైకు దొంగలు జాగ్రత్త

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.