మేడ్చల్‌లో కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో నగదు దోచుకెళ్లిన దొంగలు

author img

By

Published : Jan 24, 2023, 3:17 PM IST

firing caused a stir in Medchal district

Incident of Firing in Medchal District: మేడ్చల్​ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు గాల్లోకి కల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు వారు వైన్​షాప్​లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి, తుపాకులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

Firing Caused A Stir in Medchal District: మేడ్చల్​ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి రూ.2లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణం వద్ద దండగులు కాల్పులకు తెగబడి, మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటన చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో జరిగింది. మంకీ క్యాప్ ధరించి ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. వైన్​షాప్​లో పని చేస్తున్న జైపాల్ రెడ్డి, బాలకృష్ణపై వారు దాడి చేశారు. కర్రలతో దాడి చేసి, తుపాకులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.