మద్యం దుకాణం వద్ద కర్రలతో దాడి... ఒకరు అక్కడికక్కడే మృతి

author img

By

Published : Aug 29, 2021, 7:09 PM IST

Updated : Aug 29, 2021, 8:11 PM IST

tension at suryapet district

మద్యం దుకాణం వద్ద ఘర్షణ చేలరేగింది. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్​ రోడ్డు (నల్లబండగూడెం) వద్ద జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందారు. మద్యం దుకాణం సిబ్బంది దాడిలోనే తమవారు మరణించారంటూ.. బంధువులు ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణం లైసెన్స్​ రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​ రోడ్డు (నల్లబండగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్​ వైన్స్​ వద్ద జరిగిన దాడిలో ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమాద్​పేటకు చెందిన నాగేశ్వరావు మృతిచెందాడు. మద్యం దుకాణం సిబ్బంది దాడిలోనే నాగేశ్వరరావు మరణించినట్లు బంధువులు ఆరోపించారు. దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆందోళనకారులను నచ్చజెప్పినా వారు శాంతించలేదు. మద్యం దుకాణ లైసెన్సు రద్దుచేయాలంటూ బంధువులు నినాదాలు చేశారు.

అసలు ఏం జరిగిందంటే..

'ఏపీకి చెందిన నాగేశ్వరరావు హనుమాన్​ వైన్స్​ షాపు వద్దకు మద్యం తాగేందుకు వచ్చాడు. ఆ సమయంలో మద్యం దుకాణ సిబ్బంది, నాగేశ్వరరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన సిబ్బంది.. కర్రలతో నాగేశ్వరరావుపై దాడి చేశారు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే వైన్స్​ షాపు సిబ్బంది అక్కడ నుంచి పరారయ్యారు.'

- మృతుని బంధువులు

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ హనుమాన్​ వైన్స్​ ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. గతంలోనూ ఇక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగాయి. వినియోగదారులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించేవారని.. స్థానికులు చెబుతున్నారు.

మద్యం దుకాణం వద్ద కర్రలతో దాడి... ఒకరు అక్కడికక్కడే మృతి

ఇదీచూడండి: అఫ్గాన్ రాజధాని కాబుల్​లో పేలుడు!

Last Updated :Aug 29, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.