గుప్తనిధుల కోసం తవ్వకాలు.. చితకబాదిన గ్రామస్థులు..

author img

By

Published : Sep 25, 2022, 12:48 PM IST

Excavations of hidden treasures

ఏంటో ఈ మాయా లోకం.. అన్నీ వింత వింతగా ఉంటాయి. ఒకడు ధనలక్ష్మి ఇంటిలో నిలవాలి అంటే నరుడిని బలివ్వాలి అంటాడు.. ఇంకొకడు గుప్తనిధులు తమ ఇంటి కింద ఉన్నాయంటే పూజలు చేసి అందుకు అన్వేషించిన వాళ్లు ఉన్నారు.. అటువంటి పద్ధతిలోనే ఇప్పుడు గుప్తనిధుల తవ్వకం వికారాబాద్​ జిల్లాలో కలకలం రేపింది.

ఈ ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలపై ఇంకా విశ్వాసం పోలేదు. రాజులు దాచిన నిధులు దొరుకుతాయని, క్షుద్ర పూజలు చేయడం, గుప్తనిధులు కోసం పురాతన ఆలయాలు ధ్వంసం చేయడం వంటివి నేటికీ జరుగుతూనే ఉన్నాయి.. ఇటువంటివి పాటించే వారు వీటిపై బలమైన నమ్మకంతో ఉంటున్నారు. తాజాగా వికారాబాద్​ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారంటూ ముగ్గురు వ్యక్తులను తండా వాసులు చితకబాదిన ఘటన వికారాబాద్​ జిల్లా పరిగి మండలం సుల్తాన్​పూర్​లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్​ జిల్లాలోని సుల్తాన్​పూర్​ తండా వాసులు నిన్న రాత్రి గుప్తనిధుల తవ్వుతున్నారంటూ భూ యజమాని తులసీరాం నాయక్​ను చితకబాదారు. అతనితో పాటు అక్కడే పూజ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సైతం చితక్కొట్టారు. అడ్డువచ్చిన భూయజమాని కుటుంబాన్నీ తండా వాసులు కొట్టారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులను, దాడిలో గాయపడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తండా వాసుల దాడిలో గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం నగర ఆసుపత్రికి తరలించారు. పూజా స్థలంలో సామగ్రిని, ధ్వంసమైన రెండు బైకులు, కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.