విషాదం.. విద్యుదాఘాతంతో తండ్రీకుమారుడి మృతి

author img

By

Published : Nov 20, 2022, 11:59 AM IST

shot circuit in Narsipatnam

ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రధాన పట్టణమైన నర్సీపట్నంలో తెల్లవారుజామున షార్ట్​ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి.. తండ్రీకుమారుడు మృత్యువాతపడ్డారు. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రధాన పట్టణమైన నర్సీపట్నంలో విద్యుత్ ప్రమాదంతో తండ్రీకుమారుడు మృతి చెందారు. కృష్ణా బజారు సమీపంలోని ఇంట్లో షార్ట్​ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ఇంట్లో ఊపిరాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తండ్రీకుమారుడు మృత్యువాత పడగా.. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.