Cybercriminals news: మది దోచేస్తారు... సర్వం ఊడ్చేస్తారు..!!

author img

By

Published : Nov 22, 2021, 10:38 AM IST

cybercriminals

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కానుకలు.. గిఫ్ట్‌ చెక్కుల పేరుతో రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.

‘‘నమస్కారం.. నాపేరు లావణ్య.. మా పూర్వీకులు భారతీయులే...మా కుటుంబం యార్క్‌షైర్‌లో స్థిరపడింది... అమ్మమ్మ మాత్రమే ఉన్నారు.. కొన్నేళ్ల నుంచి బహుళజాతి సంస్థ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను.. నా తల్లిదండ్రుల చివరి కోరిక తెలుగురాష్ట్రాల్లో ఉంటున్న వారిని పెళ్లి చేసుకోవాలని... మీకు ఇష్టమైతే మాట్లాడండి’’

సికింద్రాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చిన ప్రేమపూర్వక అభ్యర్థన. కొద్దిరోజులు ఇద్దరూ వాట్సాప్‌ నంబర్‌ ద్వారా మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం ఉంగరం కొనేందుకు 85వేల పౌండ్లు పంపుతున్నాను తీసుకోండి అంటూ నెలరోజుల క్రితం లావణ్య చెప్పింది. మరుసటి రోజు దిల్లీలోని కొరియర్‌ సంస్థ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫోన్‌ వచ్చింది. చెక్కును మార్చుకోవాలంటే రుసుం చెల్లించాలని కోరగా... సరేనన్నాడు. కస్టమ్స్‌, ఆదాయపన్ను, సుంకాల పేరుతో రూ.95లక్షలు కట్టాడు. తర్వాత అవతలి వ్యక్తులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు.’’

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను లావణ్య పేరుతో మోసం చేసింది విదేశాల్లో ఉంటున్న యువతి కాదు. దిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఉంటున్న సైబర్‌ నేరస్థురాలు(Cybercriminals). ఈమే కాదు... మరికొంతమంది ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాపారులు, వృత్తినిపుణులను పరిచయం చేసుకుని ప్రేమాయణం సాగిస్తున్నారు. పెళ్లిచేసుకుందామంటూ ప్రతిపాదిస్తున్నారు. బాధితులు అంగీకరించిన వెంటనే నిశ్చితార్థం కానుకలు, గిఫ్ట్‌చెక్కుల పేరుతో మోసాలు చేసి రూ.లక్షలు కాజేస్తున్నారు.

...

వారు నిజాయతీపరులంట..

ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్న సైబర్‌ నేరస్థులు... బాధితులను మాటలతోనే సమ్మోహనులను చేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్నా సరే.. ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా దగ్గరి మనుషులు ప్రవర్తించినట్టుగా ఉంటున్నారు. అందమైన యువతుల పేరుతో పరిచయం చేసుకుంటున్నారు. వీరిబారిన పడి రూ.లక్షలు నష్టపోయిన బాధితులను పోలీసులు ప్రశ్నిస్తే... వారు నిజాయతీపరులు.. నాకు పౌండ్లు, డాలర్లు పంపుతున్నారు.. ఎయిర్‌పోర్టు, కొరియర్‌ సంస్థలే మోసం చేస్తున్నాయంటూ చెబుతున్నారు. ఫొటోలైనా చూశారా? వీడియోకాల్‌లో మాట్లాడారా? అని అడిగితే.. నమ్మకం ముఖ్యం అంటూ పోలీసులకే పాఠాలు చెబుతున్నారు.

బంగారు వజ్రాభరణాలు.. పౌండ్లు.. డాలర్లు

విదేశాల్లో ఉంటున్న వ్యాపారులు, వృత్తి నిపుణుల పేర్లతో ప్రేమాయణం మొదలుపెట్టి.. వారికి బంగారు, వజ్రాభరణాలు, వేల పౌండ్ల, డాలర్ల విలువైన గిఫ్ట్‌చెక్కులు పంపుతున్నట్లు చెప్పి తర్వాత బ్యాంక్‌, విమానాశ్రయ అధికారుల పేర్లతో మోసం చేస్తున్నారు. ఇక బాధితులతో వాట్సాప్‌ ద్వారా మాట్లాడుతున్న సైబర్‌ నేరస్థులు వారుంటున్న ప్రాంతాల విశేషాలు, పనిచేస్తున్న కార్యాలయాలు, కార్పొరేట్‌ సంస్థల వివరాలను సరిగ్గా వివరిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లోని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సాప్‌ ద్వారా మాట్లాడేప్పుడు ఏ దేశం నుంచి ఫోన్‌ చేస్తున్నారో అక్కడి ఐఎస్‌డీ నంబర్‌ బాధితుల చరవాణిలో కనిపించేలా చేస్తున్నారు.

....



ఇదీ చూడండి: Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.