సైబర్ మోసగాళ్లు(Cyber Cheaters) హైదరాబాద్ నగరవాసులను రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బిట్ కాయిన్ ట్రేడింగ్(Bit Coin Trading) పేరుతో టార్గెట్ చేస్తున్నారు. మూడు రోజుల్లో ముగ్గురికి ఎరవేసి రూ.60 లక్షలకు పైగా కాజేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తాజాగా హైదరాబాద్(Hyderabad)లోని హబ్సిగూడకు చెందిన ఓ వ్యక్తిని ట్రాప్ చేసి కాయిన్ యు ఎఫ్ యాప్(Coin u f App)ను సైబర్ నేరగాళ్లు(Cyber Cheaters) డౌన్లోడ్ చేయించారు. విడతల వారీగా రూ.12 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించిన తర్వాత సైబర్ నేరగాళ్లు యాప్ను డిలీట్ చేసినట్లు బాధితుడు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్(Cyber Crime Police) పోలీసులను ఆశ్రయించాడు.
వాట్సప్ గ్రూప్ ద్వారా
మూడు రోజుల క్రితం ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. బిట్ కాయిన్- ఎం8(Bit Coin M8) పేరుతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. నగరంలోని చంద్రయాణగుట్టకి చెందిన ఓ వ్యక్తి ఫోన్ నంబర్ను అందులో యాడ్ చేశారు. బిట్ కాయిన్ వ్యాపారంపై శిక్షణ ఇస్తున్నట్లు ఆ వ్యక్తిని మభ్యపెట్టారు. విడతల వారీగా అతడి నుంచి రూ.14 లక్షలకు పైగా కాజేసి... ఆ తర్వాత వాట్సప్ గ్రూప్ డిలీట్ చేశారు. మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. మరో ఘటనలో ఓ యువకుడిని సైతం బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు.
మూడు రోజుల్లో ముగ్గురి నుంచి రూ.60లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో సైబర్ క్రైం పోలీసులు బిట్ కాయిన్ ట్రేడింగ్పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నేరగాళ్లు ఎక్కడి నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నారు.? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు.? వీరికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారా.? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయి.. కల సాకారమయ్యే వేళ ప్రాణం కోల్పోయి