ప్రజాప్రతినిధి దాష్టీకం.. యువకులపై దాడి

author img

By

Published : Jun 1, 2022, 4:47 PM IST

కౌన్సిలర్ జానీ

ఆయనో ఓ ప్రజాప్రతినిధి అందరికి మంచి చెప్పాల్సిన తానే దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సినిమా థియేటర్​లో తన అనుచరుడితో గొడవకు దిగారనే కారణంతో ముగ్గురు యువకులను చితకబాదాడు. దాడి దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డ్​ అయ్యాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ముగ్గురు యువకులను కౌన్సిలర్ జానీ చితకబాదాడు. దాడి దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డ్​ అయ్యాయి. థియేటర్​లో ఆయన అనుచరుడికి ముగ్గురు యువకుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అతను జానీకి ఫోన్​చేసి విషయం చెప్పాడు. వెంటనే 10 మంది యువకులతో కలిసి కౌన్సిలర్ థియేటర్ వద్దకు చేరుకుని ముగ్గురు వ్యక్తులపై దాడికి దిగాడు.

విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ థియేటర్​లో గొడవను ఆపేందుకు యత్నించాడు. ఆయనను కూడా పక్కకు తోసివేశారు. ఈ దాడిలో నాగరాజు అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సిలర్​పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ప్రజాప్రతినిధి దాష్టీకం.. యువకులపై దాడి

ఇదీ చదవండి: గ్యాస్ రీఫిల్ సెంటర్‌లో పేలుడు... శరీరం రెండు ముక్కలై.. వ్యక్తి మృతి

బొమ్మకు ఉరివేసి 8ఏళ్ల బాలుడి సూసైడ్​.. ఆ​ వీడియో చూసే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.