గ్రామాల్లోకి కిరాణం దుకాణం నడిపే వ్యక్తులకు అధిక లాభాలు ఆశ జూపి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న… సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో నడుపుతున్న మంజునాథ వైన్స్ దుకాణం యజమానిపై… చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గోరంట్లకి చెందిన అల్లి వీరన్న, కవిత, చంద్రు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
గ్రామంలో పొట్ట కూటికోసం చిన్న కిరాణం దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమకు… బెల్ట్షాప్ నిర్వహిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని ఆశ జూపారు. మద్యం పోలీసులు పట్టుకుంటే ఇప్పించే బాధ్యత, కేసులు లేకుండా చూసే బాధ్యత మాదే అని నమ్మబలికి తర్వాత చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ఎస్సై బండి సాయి ప్రశాంత్ను వివరణ కోరగా… ఫిర్యాదు అందజేసిన విషయం వాస్తవమేనని బాధితులు… ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గిరిజన యువతిపై హత్యాచారం.. నిందితుడు అరెస్టు