BUSSES ACCIDENT: రెండు బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

author img

By

Published : Aug 23, 2021, 1:19 PM IST

busses accident

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న మరో బస్సు ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారిపై టోల్​గేట్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సును వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో రెండున్నర ఏళ్ల పాపతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

హైదరాబాద్​ నుంచి పటాన్ చెరు వెళ్తున్న సంగారెడ్డి డిపో బస్సును.. వెనుక నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Liquor Sales: జోరుగా మద్యం విక్రయాలు.. ఖజానాకు ఆదాయం ఫుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.