BUS ACCIDENT: ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మందికి గాయాలు

author img

By

Published : Oct 15, 2021, 7:30 AM IST

accident

07:05 October 15

పండగపూట ప్రమాదం

accident
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ప్రమాదం

అందరూ పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి బయలుదేరారు. తమ వారిని కలుసుకుంటామనే ఆనందంలో నిద్రకు ఉపక్రమించారు. కానీ ప్రమాదం జరిగుతుందని వారు ఎవరూ ఊహించలేదు. ప్రాణనష్టం జరగకపోయినా... ప్రాణం పోతుందనే భయం తమను వెంటాడిందని వారు వాపోయారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు (BUS ACCIDENT) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. 

ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్​ నుంచి కర్నూల్ వెళ్తుండగా ఈ ప్రమాదం (BUS ACCIDENT) చోటు చేసుకుందని వెల్లడించారు. 20 మందికి గాయలయ్యాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లనే ప్రమాదం (BUS ACCIDENT) చోటు చేసుకుందని వారు ఆరోపించారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదీ చూడండి: ప్రేమించినోడిని పెళ్లాడేందుకు పోరాటమే చేసింది.. మనువైన మరు నెలకే..

ఆడుకుంటూ చెరువులో జారిపడి నలుగురు చిన్నారులు మృతి

Bus Fire: ఆగి ఉన్న బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.