ATTACK: భూవివాదంలో గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొన్న అన్నదమ్ములు

author img

By

Published : Jul 6, 2021, 6:57 AM IST

brothers fighting

భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు గొడవకు దిగారు. కారంపొడి చల్లుకొని.. గొడ్డలి, కొడవళ్లతో పరస్పరం దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.

భూవివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరికి కారంపొడి చల్లుకొని.. గొడ్డలి, కొడవళ్లతో దాడిచేసుకొనేంతవరకు వచ్చింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గార్​చర్ల గ్రామంలో ఆళ్లకుంట కిష్టయ్యకు సర్వే నంబర్​.. 357, 358, 359లో 20 ఎకరాల భూమి ఉంది. అతనికి నలుగురు కుమారులు.. చిన్న కురుమయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, తిరుపతయ్య సహా ఒక కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు తిరుపతయ్య 6 ఎకరాలు, కిష్టయ్య భార్య పేరున మూడున్నర ఎకరాలు భూమి పట్టా చేయించారు. మిగిలిన పదిన్నర ఎకరాల్లో మిగతా అన్నదమ్ములు భూమిని సదను చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కారంపొడి చల్లుకొని, గొడ్డలి, కొడవళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచూడండి: fake diamond: నకిలీ వజ్రం కుదువపెట్టి.. రూ.58.60 లక్షలు కొల్లగొట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.