కోర్టులో ఆ కేసు ఉండగానే.. మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త

author img

By

Published : Nov 17, 2022, 1:58 PM IST

MURDER ATTEMPT ON LECTURER

MURDER ATTEMPT ON LECTURER : కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త.. తన భార్యపై దాడి చేసిన ఘటన ఏపీలోని అనంతపురంలో కలకలం రేపింది. ఆర్ట్స్​ కళాశాలలో లెక్చరర్​గా పనిచేస్తున్న సుమంగళి అనే మహిళపై ఆమె భర్త కత్తితో దాడిచేశాడు.

MURDER ATTEMPT ON LECTURER : ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సుమంగళి అనే లెక్చరర్​పై ఆమె భర్తే హత్యాయత్నం చేశాడు. కళాశాల మైదానంలో కత్తితో గొంతు కోశాడు. లెక్చరర్​ కేకలు విన్న తోటి సిబ్బంది, విద్యార్థులు రక్తపుమడుగులో ఉన్న ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. భార్య గొంతు కోసి పరారవుతున్న భర్తను తోటి లెక్చరర్లు పట్టుకుని.. మూడో పట్టణ పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.

భర్తతో విభేదాల కారణంగా కోర్టులో విడాకుల కోసం కేసు వేశారు. కోర్టులో కేసు ఉండగానే సుమంగళిపై భర్త పరేశ్‌ హత్యాయత్నం చేశాడు. రాయదుర్గానికి చెందిన సుమంగళి.. కామర్స్ లెక్చరర్​గా పని చేస్తున్నారు. సుమంగళి ఇటీవలే గుంటూరు ఎయిడెడ్ కళాశాల నుంచి అనంతపురానికి బదిలీ అయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.