చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Jul 13, 2022, 1:29 PM IST

Updated : Jul 13, 2022, 2:11 PM IST

చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

13:26 July 13

చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూర్‌ మండలం గోదరిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నిర్మల్‌ జిల్లా కుంటాల, భైంసా వాసులుగా గుర్తించారు. వర్షాల నేపథ్యంలో వసతి గృహాల్లోని పిల్లలను తీసుకొచ్చేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతదేహాలు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

నిత్యానంద స్వామికి 18 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే...

Last Updated :Jul 13, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.