ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి

author img

By

Published : Jun 13, 2021, 10:22 AM IST

వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో అదుపుతప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కంకర క్వారీలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జరిగింది.

స్థానికులు.. క్షతగాత్రులను మహబూబ్​నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.