బిడ్డలను చంపిన భర్తను చంపిన భార్య.. ఆ భయంతోనే..!

author img

By

Published : Sep 19, 2022, 10:16 AM IST

బిడ్డలను చంపిన భర్తను చంపిన భార్య.. ఆ భయంతోనే..!

wife killed husband: అతడికి అది మూడో పెళ్లి. ఆమెకు అది రెండో వివాహం. ఇద్దరూ కలిసి అన్యోన్యంగా జీవించసాగారు. వారికి ముత్యాల్లాంటి ఇద్దరు మహాలక్ష్ములు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో రత్నాల్లాంటి ఇద్దరి బిడ్డలను కిరాతకంగా చంపాడు ఆ భర్త. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించి చావు నుంచి బయటపడ్డాడు. బిడ్డలను పొట్టన పెట్టుకున్న భర్త తననూ చంపేస్తాడని భయపడిన మహిళ.. అతడిని చంపేసింది.

wife killed husband: నాగర్​కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ కర్కశ తండ్రి కన్నబిడ్డలను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు. కానీ ఎట్టకేలకు చావుబతుకుల నుంచి బయటపడ్డాడు. తన కుమార్తెలను చంపిన భర్త తనని కూడా చంపుతాడేమోనన్న భయంతో భార్య అతడిని హత్య చేసింది. కొల్లాపూర్​ మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొల్లాపూర్‌ మండలం కుడికిల్లకు చెందిన ఓంకార్‌(39)కు మహేశ్వరి మూడో భార్య. ఆమెకు ఇది రెండో వివాహం. వీరిద్దరికి కుమార్తె చందన (3), కుమారుడు విశ్వనాథ్‌ (1) ఉన్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఇద్దరూ తరుచూ గొడవ పడేవారు. ఆగస్టు 17న ఓంకార్‌ తన ఇద్దరు పిల్లలను కోడేరు మండలం ఎత్తం గుట్ట వద్ద గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ ఘటనలో మహేశ్వరి తప్పించుకొని పారిపోయింది.

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో చికిత్స పొందిన ఓంకార్‌ ఈనెల 16న కుడికిల్లకు వచ్చాడు. బిడ్డలను చంపినవాడు తననూ చంపుతాడని భయపడిన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఓంకార్‌ను చంపేసింది. అనంతరం కొల్లాపూర్‌ ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. మృతుడి తల్లి బాలకిష్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఒకే గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య.. ఆ వ్యవహారమే కారణమా..?

అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.