పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో.. ఆరేళ్ల దివ్యాంగ బాలిక రైలు నుంచి జారిపడింది. గమనించిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. వారు.. వెంటనే రైలు ఆపి.. బాలికను ఆస్పత్రికి తరలించారు.
బాలిక.. హైదరాబాద్ నుంచి బల్లార్ష వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆమెను ఎవరైనా తోసేసి ఉంటారని ప్రయాణికులు భావిస్తున్నారు. సిబ్బంది సమాాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కోసం ఇంకా ఎవరూ రాలేదని వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యుల సమచారం సేకరించి వారికి విషయం తెలియజేస్తామని చెప్పారు.
- ఇదీ చదవండి : SUICIDE : పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అందుకేనా?