తోటి విద్యార్థులు హేళన చేశారని ఆరో తరగతి​ బాలిక ఆత్మహత్య

author img

By

Published : Jul 29, 2022, 10:59 AM IST

తోటి విద్యార్థులు హేళన చేశారని మైనర్​ బాలిక ఆత్మహత్య

minor girl suicide: తోటి విద్యార్థులు హేళన చేశారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

minor girl suicide: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్​లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక స్ఫూర్తి ఫౌండేషన్​లో ఓ మైనర్​ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​కు చెందిన బాలికకు చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా.. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్​కు వెళ్లింది. అప్పటి నుంచి బాలిక తన అక్కతో కలిసి దుండిగల్​లోని స్ఫూర్తి ఫౌండేషన్​లో ఉంటూ ఆరో తరగతి చదువుకుంటోంది.

ఈ క్రమంలోనే ఇటీవల బాలిక 15 రోజుల పాటు తన స్వస్థలానికి వెళ్లి.. తిరిగి ఫౌండేషన్​కు చేరుకుంది. అనంతరం ఇక్కడ ఉండటం ఇష్టం లేక మళ్లీ ఇంటికి వెళ్లాలనుకుంది. విషయం తెలిసిన తోటి విద్యార్థులు బాలికను హేళన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు విషయం తెలుసుకున్న తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు ఫౌండేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చనిపోయిన విద్యార్థిని ఒంటిపై గాయాలున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.