రిసార్టులో డేంజర్ గేమ్, సాప్ట్​వేర్ ఇంజినీర్ దుర్మరణం

author img

By

Published : Oct 30, 2022, 1:05 PM IST

Updated : Oct 30, 2022, 2:32 PM IST

game of danger

12:57 October 30

డేంజర్‌ గేమ్‌లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

వికారాబాద్​ చుట్టూ రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ రిసార్టుల్లో నిర్వహించే డేంజర్ గేమ్స్ యువకుల పాలిట శాపంగా మారాయి. తాజాగా నిన్న రాత్రి ఓ రిసార్టులో ఈ డేంజర్​ గేమ్​ వల్ల​ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గోధుమగూడలోని రిసార్ట్​లో అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో భాగంగా డేంజర్ గేమ్ ఏర్పాటు చేశారు. దూరంగా పడేసిన వస్తువును తీసుకురావడమే ఈ డేంజర్ గేమ్ టార్గెట్.

అందులో పాల్గొనడానికి నిన్న సాయంత్రం రిసార్టుకు దాదాపు వందమంది యువకులు వచ్చారు. అందరూ కలిసి ఈ గేమ్​ ఆడారు. ఈ క్రమంలో రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టారు. దానిని వెతికి తీసుకువద్దామని సాయికుమార్ అనే యువకుడు బావిలోకి దూకాడు. బావిలోకి దూకిన సాయికుమార్(34) దురదృష్టవశాత్తు ఊపిరాడక మృతి చెందాడు. మృతుడు నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 30, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.