దసరా తర్వాత 2,500 మంది కార్మికులతో ఆస్పత్రి నిర్మాణ పనులు: హరీశ్​రావు

author img

By

Published : Jul 18, 2022, 1:11 PM IST

Harishrao

Harishrao Warangal Tour: వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వరంగల్‌ పర్యటనలో ఉన్న ఆయన సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి ఆస్పత్రి పనులతోపాటు, నిర్మాణ నమూనా పరిశీలించారు.

Harishrao Warangal Tour: వరంగల్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. సెంట్రల్ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను, నిర్మాణ నమూనాను మంత్రులు పరిశీలించారు. ప్రస్తుతం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారని దసరా తర్వాత 2,500 కార్మికులతో నిర్మాణ పనులు చేయిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

'ఆస్పత్రి నిర్మాణం కోసం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆస్పత్రి నిర్మాణం మరింత వేగంగా జరిగేందుకు చర్యలు. వర్షాలు తగ్గాకా 2,500 మంది కార్మికులతో నిర్మాణ పనులు. 24 అంతస్థుల భవనానికి అన్ని అనుమతులు తీసుకున్నాం. భవనంలో 16 అంతస్థులు ఆస్పత్రి నిర్మాణం. మిగిలిన 8 అంతస్థుల్లో వైద్యులకు వసతి, సెమినార్ హాళ్ల నిర్మాణం జరుగుతుంది.'-హరీశ్​రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నట్లు హరీశ్​ వివరించారు. మొత్తం 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం చేపట్టగా.. అందులో 16 అంతస్తులు రోగుల కోసం మిగిలిన 8 అంతస్తులు వైద్యులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కేటాయించినట్లు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్, వరంగల్ మేయర్ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.