Saidabad rape case:  'సీఎం కేసీఆర్​ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'

author img

By

Published : Sep 15, 2021, 1:41 PM IST

Updated : Sep 15, 2021, 4:00 PM IST

ys-sharmila-visitation-of-saidabad-incident-victim-family

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. గుండెలవిసేలా రోధిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. వీలైనంత తొందరగా నిందితున్ని పట్టుకుని... కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్​ చేస్తూ.. దీక్ష కొనసాగిస్తున్నారు.

'సీఎం కేసీఆర్​ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'

సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్షకు కూర్చున్నారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిల.. బాధతో కుంగిపోతున్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పారు. తాము అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా... నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి దీక్ష ప్రారంభించారు. హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే.. ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

పోలీసులు వైఫల్యమే ఇది...

ప్రగతిభవన్‌లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారని... కానీ ప్రజలు అంటేనే లెక్కలేదని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌, మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. బంగారు తెలంగాణ కాదని... బారులు, బీర్ల తెలంగాణగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో నీళ్లు దొరకవు కానీ.. మద్యం దొరుకుతుందని మండిపడ్డారు. ఈ ఘటన పోలీసుల వైఫల్యమేనని.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. లాఠీఛార్జీ చేసి చిన్నారి శవాన్ని తీసుకెళ్లి.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పోస్టుమార్టం చేయించారని.. ఇంత వరకూ ఆ నివేదిక ఇవ్వలేదని ఆక్షేపించారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా కేసీఆర్‌కు తొత్తుల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.

ఈ నెల 9న చిన్నారిపై పాశవికంగా రాజు అనే కామాంధుడు.. అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేస్తున్నా.. పట్టుబడకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. నిందితుడు రాజును పట్టిస్తే పది లక్షల రివార్డును అందిస్తామని పోలీసులు మంగళవారం ప్రకటించారు.

ఇదీ చూడండి:

Last Updated :Sep 15, 2021, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.