ముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర రవాణా శాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించకపోతే.. ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని తేల్చి చెప్పింది. రవాణా మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కాన్వాయ్ వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. వీఐపీల కాన్వాయ్ల కోసం ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమని లెక్క వేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి.. ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొంది.
ఇవీ చదవండి..:
Acb Raids On MPO Officer: ఏసీబీ వలలో సంగారెడ్డి ఎంపీఓ.. ఆస్తులు ఎన్ని కూడబెట్టాడంటే!
పెళ్లిపీటలపై విషాదం.. జీలకర్ర బెల్లం పెడుతుండగా కుప్పకూలిన వధువు