TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM

author img

By

Published : May 29, 2022, 2:59 PM IST

top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • మూడు రోజులు ముందే వచ్చిన రుతుపవనాలు

Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళను తాకాయి. సాధారణంగా జూన్​ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  • సరిహద్దులో పాక్​ డ్రోన్​ కూల్చివేత..

Pakistan drone shot down: జమ్ముకశ్మీర్​, కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్​కు చెందిన ఓ డ్రోన్​ను కూల్చివేశాయి భద్రతా దళాలు. డ్రోన్​ మోసుకొచ్చిన బాక్సులో గ్రెనేడ్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • 'వారికి ఆధార్ జిరాక్స్​ కాపీ ఇవ్వొద్దు'

ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇవ్వడంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. పూర్తి ఆధార్ నంబర్ ఉన్న జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని సూచించింది. మిగిలిన చోట్ల 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే మాస్క్​డ్​ ఆధార్ ఇవ్వాలని సలహా ఇచ్చింది.

  • మూడ్రోజులు మోస్తరు వర్షాలు

Rain alert in Telangana: మూడ్రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది.

  • పురి విప్పిన నెమలి నాట్యం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భానుడి భగభగలు తగ్గాయి. రోజంతా ఉక్కపోతలో మగ్గుతున్నా.. సాయంత్రం వరకు వాతావరణం చల్లబడుతోంది. వర్షాలతో కొమ్మలు చిగురిస్తున్నాయి. పరిసరాలు పచ్చగా మారడంతో ఆహ్లదకరంగా మారాయి

  • డ్రైవర్​ దస్తగిరిపై పోలీసు కేసు.. ఎందుకంటే..!

Case filed on Approver Dasthagiri: తనను చంపుతానని దస్తగిరి బెదిరించాడని ఓ వ్యక్తి తొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరిపై కేసు నమోదు చేశారు.

  • బంగారంపై పెట్టుబడులు భద్రమేనా?

Investments in gold: రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని చూస్తున్నాం. కరోనా మహమ్మారి, అంతర్జాతీయంగా కొనసాగుతున్న సంక్షోభం తదితర ఎన్నో అంశాలు పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలూ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాస్త భరోసా ఉండే పెట్టుబడుల వైపు చూసేవారికి బంగారం మంచి ఎంపికగా మారుతోంది.

  • ఎయిర్​ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్​!

plane air taxi: రోడ్లపై ట్రాఫిక్​ జామ్​లకు చెక్​ పెట్టేలా ఎయిర్​ ట్యాక్సీలను రూపొందించింది దిల్లీకి చెందిన ఈ-ప్లేన్​ అనే సంస్థ. ఇద్దరు ప్రయాణించేలా.. హెలికాప్టర్​ మాదిరిగా దీన్ని తయారు చేశారు రూపకర్తలు. 2023 నాటికి దీని ట్రయల్​ రన్​ నిర్వహిస్తామని తెలిపారు.

  • బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది.

  • కుర్రకారు మతిపోగొడుతున్న వర్మ హీరోయిన్లు

తన సినిమాల్లో హీరోయిన్లను హాట్​గా చూపిస్తుంటారు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఈ హీరోయిన్లు రియల్​ లైఫ్​ కూడా అదే జోరు ప్రదర్శిస్తుంటారు. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ హాట్​ హాట్​ ఫొటోలు షేర్​ చేస్తుంటారు. పూజ భలేకర్​, నైనా గంగూలీ, అప్సరా రాణీలు ఈ కోవకు చెందిన వారే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.