మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత... నేడు తొలి కేబినెట్‌ భేటీ

author img

By

Published : May 12, 2022, 2:19 PM IST

cabinet meeting

Cabinet Meeting: మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్​లో ఈ రోజు మద్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

Cabinet Meeting: మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత ఏపీ కేబినెట్‌ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో సమావేశం జరగనుంది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి.. దానిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం, గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:యూట్యూబ్​లో ఆ వీడియో చూశాడు.. వ్యాపారి నుంచి రూ. 45 లక్షలు కొల్లగొట్టాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.