మహానాడు వేదిక కోసం స్థల పరిశీలన చేసిన తెదేపా నేతలు

author img

By

Published : May 15, 2022, 10:06 AM IST

TDP Mahanadu

TDP Mahanadu at Prakasam District: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మహానాడు వేదిక కోసం శనివారం స్థల పరిశీలన చేశారు. తాజాగా గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు.

TDP Mahanadu at Prakasam District: ఏపీలోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడు వేదిక కోసం ఆ పార్టీ నేతలు స్థల పరిశీలన చేశారు. ఒంగోలు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సభ పెట్టాలని తొలుత నేతలు భావించారు. తాజాగా మద్దిపాడు మండలం గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు. గ్రోత్ సెంటర్​లోని మహి ఆగ్రోస్ పరిశ్రమలో భారీ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

వర్షం పడితే బహిరంగ ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తుతాయనే.. ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. మహానాడు నిర్వహణకు పదహారు కమిటీలు ఏర్పాటయ్యాయని.. ఈ మేరకు వీరంతా త్వరలో వేదిక ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారని నేతలు వెల్లడించారు. ఈనెల 27న 10వేల మందితో ప్రతినిధుల సభ.. 28న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారని నేతలు వెల్లడించారు.

ఇవీ చదవండి..:

Amith shah On CM Kcr: ఇంత అసమర్థ సీఎంను నేనెప్పుడూ చూడలేదు: అమిత్ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.