Telangana Corona Cases: రాష్ట్రంలో 2707 మందికి కొవిడ్ పాజిటివ్​

author img

By

Published : Jan 13, 2022, 7:30 PM IST

Updated : Jan 13, 2022, 8:32 PM IST

telangana corona news

19:24 January 13

రాష్ట్రంలో ఇవాళ 2707 మందికి కొవిడ్ పాజిటివ్​

telangana corona news
జిల్లాల వారీగా కరోనా కేసులు

Telangana Corona Cases: రాష్ట్రంలో ఇవాళ 84,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,707 మందికి వైరస్​ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,02,801కు చేరింది. కరోనా బారినపడి మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,049కు చేరింది. కొవిడ్​ నుంచి మరో 582 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 6,78,290 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 1,328 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

దేశంలో అమాంతం పెరిగిన కేసులు..

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,63,17,927
  • మొత్తం మరణాలు: 4,85,035
  • యాక్టివ్ కేసులు: 11,17,531
  • మొత్తం కోలుకున్నవారు: 34,715,361

ఇదీచూడండి: ASK KTR: లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉంటుందా?.. మంత్రి కేటీఆర్​ ఏమన్నారంటే..

Last Updated :Jan 13, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.