Rythu Sangala Dharna at Indira Park today: కాసేపట్లో రైతు సంఘాల మహాధర్నా.. హాజరుకానున్న రాకేశ్‌ టికాయత్

author img

By

Published : Nov 25, 2021, 7:09 AM IST

Updated : Nov 25, 2021, 11:22 AM IST

Rythu Sangala Dharna at Indira Park, rakesh tikait, ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల ధర్నా, రాకేశ్ టికాయత్

Rythu Sangala Dharna at Indira Park today : కాసేపట్లో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాలు మహాధర్నా చేయనున్నాయి. సాగుచట్టాల రద్దును, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేసి పార్లమెంట్​లో ఆమోదించాలనే డిమాండ్లతో ఆల్ ఇండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ టికాయత్ పాల్గొననున్నారు.

Rythu Sangala Dharna at Indira Park today : దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ నేడు హైదరాబాద్‌లో మహాధర్నా జరగనుంది. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం నేత రాకేశ్ టికాయత్‌, ఏఐకేఎంఎస్‌ ప్రధాన కార్యదర్శులు అతుల్‌ కుమార్‌ అంజన్‌, హన్నన్‌ మెల్లా, ఏఐకేఎంఎస్‌ నేతలు జీఎస్‌ ఆశిష్‌ మిత్తల్‌, భూమి బచావో ఆందోళన్‌ నేత జగ్తార్‌ బాజ్వా తదితరులు పాల్గొననున్నారు.

rakesh tikait in Hyderabad : నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహాధర్నా సాగుతుంది. అనంతరం.. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో కిసాన్ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో హైదరాబాద్‌లో చేపట్టిన ఈ మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజా సంఘాల కార్యకర్తలు తరలిరావాలని ఏఐకేఎస్‌సీసీ తెలంగాణ కమిటీ నేతలు కోరారు.

Farmer's Association Dharna at Indira Park 2021 : కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మెుల్లా డిమాండ్‌ చేశారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దేశంలో ప్రతిరోజు 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.... మోదీ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెుల్లా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నేడు నిర్వహించే కిసాన్‌ మహా పంచాయత్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్ టికాయిత్‌ పాల్గొంటారని వెల్లడించారు.

ఇవీ చదవండి :

Last Updated :Nov 25, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.