రైల్వేస్టేషన్​ ప్రారంభోత్సవంలో టీఆర్​ఎస్​, భాజపా నినాదాలు

author img

By

Published : Sep 23, 2022, 10:20 PM IST

central minister kishanreddy

Railway station opening at medak:అక్కన్నపేట రైల్వే స్టేషన్​ ప్రారంభోత్సవంలో తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పర నినాదాలు చేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అటు తెరాస కార్యకర్తలు, ఇటు భాజపా కార్యకర్తలు ఎవరికి వారు పోటీగా నినాదాలు చేయడంతో స్టేషన్​లో కాసేపు గందరగోళం ఏర్పడింది.

Railway station opening at medak: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన మెదక్ జిల్లా అక్కనపేట​ రైల్వే స్టేషన్​ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ రైల్వేస్టేషన్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాస్ట్​ షేరింగ్​ పద్ధతిలో అభివృద్ధి చేశాయి. ప్రారంభోత్సవ సందర్భంగా తెరాస, భాజపాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

కేంద్రమంత్రి స్టేషన్​లోకి అడుగుపెట్టగానే అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్​, జై పద్మక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి పోలీసులు ఎంత చెప్పినాసరే పట్టించుకోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు సైతం జై భారత్​ మాత, జైజై భారత్​మాత, వందేమాతరం, జై నరేంద్రమోదీ అంటూ నినదించారు. రెండు పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో రైల్వే స్టేషన్​ ప్రాంగణం దద్దరిల్లింది.

ఒక దశలో కార్యకర్తలు సభా వేదిక వైపు దూసుకొస్తారేమో అనిపించింది. ఈ అనూహ్య పరిణామాలు పోలీసులకు ఆందోళనను గురి చేసింది. వేదిక మీద మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్​ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించేటప్పుడు కూడా ఇరు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ప్రశాంతంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిపోయింది.

మెదక్​ రైల్వేస్టేషన్​ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.