MP Raghurama: నా గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారు: రఘురామ

author img

By

Published : May 14, 2022, 6:42 PM IST

ఎంపీ రఘురామ

MP Raghurama on last year his birthday incident: కనీసం నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని చెప్పారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గతేడాదిని గుర్తుచేసుకున్నారు.

MP Raghurama on last year his birthday incident: కనీసం నిల్చొనే పరిస్థితి కూడా లేకుండా ఆనాడు తనను కొట్టారని వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామ అన్నారు. తన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారని చెప్పారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన నేడు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గతేడాదిని గుర్తుచేసుకున్నారు.

‘‘నా సెల్‌ఫోన్‌ కోసం వెతికి మళ్లీ నన్ను కొట్టారు. మొత్తం ఐదుసార్లు నన్ను తీవ్రంగా కొట్టారు. సీఎం జగన్‌, సునీల్‌ ఇద్దరూ అద్భుత కళాకారులు. ఓ కానిస్టేబుల్‌ వచ్చి ఏం జరిగింది.. ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారు. హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టారు. ఉన్మాది సంస్కృతిలో భాగంగానే నాపై దాడి చేశారు. ఇది నా 60వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజుల ఘనంగా జరుపుకొన్నా. 59వ పుట్టినరోజు ఘనంగా జరిపిన ఉన్మాదానికి నా ధన్యవాదాలు. 2024లో ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెబుతారు’’ - రఘురామకృష్ణ రాజు

రఘురామకు ఫోన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ పర్యటన తర్వాత అమిత్‌షా తనను కలవనున్నట్లు రఘురామ వెల్లడించారు. గతేడాది ఇదే రోజు రఘురామను హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని సీఐడీ అభియోగం మోపిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : 'క్లబ్​లు, పబ్​లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు'

తండ్రి పాదాలు కడిగిన కుమారుడు.. ఇంట్లోంచి గెంటేసిన కొన్నాళ్లకే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.