తెలంగాణ పశుసంవర్ధక శాఖపై కర్ణాటక మంత్రి ప్రశంసలు..

author img

By

Published : Nov 24, 2021, 10:16 PM IST

Karnataka minister praises telangana Animal Husbandry and Fisheries department

హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు పశుసంక్షేమ భవన్‌లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(minister talasani srinivas yadav latest news)ను కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్(karnataka minister prabhu chauhan latest news) మర్యాదపూర్వకంగా కలిశారు. పాడి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పశుసంవర్ధక శాఖ(telangana Animal Husbandry and Fisheries department) ఆధ్వర్యంలో రైతు చెంతకే వెళ్లి అందిస్తున్న పశు వైద్య సేవలు బాగున్నాయని మంత్రి ప్రశంసించారు.

తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్యశాల పనితీరు, టోల్‌ఫ్రీ నంబరు-1962 సేవలు అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్(karnataka minister prabhu prises telangana scheme) ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గోశాల సందర్శించిన మంత్రి... సంచార పశువైద్యశాలల పనితీరును పరిశీలించారు. అధ్యయనం నిమిత్తం మంత్రి నేతృత్వంలో కర్ణాటక బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా... హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు పశుసంక్షేమ భవన్‌లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు(karnataka minister prabhu chauhan met talasani srinivas yadav). పాడి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతు చెంతకే వెళ్లి అందిస్తున్న పశు వైద్య సేవలు బాగున్నాయని... రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ స్ఫూర్తితోనే..

"దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ స్ఫూర్తితో కర్ణాటకలో జనాభా దృష్ట్యా... పాడి, మాంసం ఉత్పత్తులు పెంపొందించేందుకు రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు 1962 సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం 15 జిల్లాల్లో పశుసంజీవని పేరిట ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో మిగతా జిల్లాల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక సంచార వైద్యశాల అందుబాటులోకి తీసుకొస్తాం. గోసంరక్షణ కేంద్రాలు సహా పశువులన్నింటికీ కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. రైతు ఫోన్ చేస్తే సంచార వైద్యశాల ఇంటి ముంగిటకే వచ్చేలా 27X7 సేవలందిస్తాం." - ప్రభు బీ చౌహాన్​, కర్ణాటక మంత్రి

కర్ణాటకకు సహకారం ఉంటుంది..

"వ్యవసాయ అనుబంధ పాడి రంగం బలోపేతం, రైతాంగం అభ్యున్నతి కోసం పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఉచిత చేప పిల్లల పంపిణీ వంటి పథకాల వల్ల మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించాం. పాడి రంగం అభివృద్ధి, రైతుల ఆదాయాల పెంపు విషయంలో తెలంగాణ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి ఎల్లప్పుడు సహాయ సహకారాలు ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా రైతాంగం అభివృద్ధి విషయంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది." - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, రాష్ట్ర మంత్రి

30 ఏళ్లలో ఇలాంటివి చూల్లేదు..

జీహెచ్‌ఎంసీ మేయర్ కార్యాలయంపై భాజపా కార్పొరేటర్లు దాడి చేయడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లు దాడి చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తరహా ఘటనలు చూడలేదని ఆవేదిన వ్యక్తం చేశారు.

చట్టం తన పని తాను చేసుకుంటుంది..

"ఏమైనా సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి తప్ప మేయర్ కార్యాలయంపై దాడులు చేస్తామంటే కుదరదు. ఈ తరహా ఘటనలను ప్రజలు హర్షించరు. మేం ఇలానే చేస్తామంటే.. చట్టం కూడా తన పని తాను చేసుకుంటుంది. కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఇది పరిగణలోకి తీసుకోకుండా దౌర్జన్యం చేయడమేంటి. ప్రజాస్వామ్యంలో వినతులు సమర్పించడం ద్వారా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం... ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు." - తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మంత్రి

ఈ నెల 21న భవనేశ్వర్‌లో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో తెలంగాణ మత్యశాఖ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు 10 లక్షల రూపాయలు నగదు పురస్కారం స్వీకరించిన పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, కమిషన్ భూక్యా లచ్చీరాంను మంత్రి తలసాని అభినందించారు.

ఇదీ చూడండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.