రాష్ట్రంలో నకిలీ ఎరువుల కుంభకోణం.. ఏపీలో దర్యాప్తు!

author img

By

Published : May 11, 2022, 6:07 PM IST

Fake Fertilisers case

Fake Fertilisers case: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో కలకలం రేపిన నకిలీ ఎరువుల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వెళ్లిన తెలంగాణ అధికారులు విజయవాడ శివారు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.

Fake Fertilisers case: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కలకలం రేపిన కల్తీ పొటాష్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇసుక రంగుమార్చి పొటాష్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వెళ్లిన తెలంగాణ పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ శివారు నున్నలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో విస్తారంగా పెంచిన ఆ మొక్కలపై నిషేధం.. అవి అంత డేంజరా..?

కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులపై తెలంగాణ అభ్యంతరం..

రష్యాకు ఉక్రెయిన్ షాక్.. గ్యాస్ సరఫరాకు బ్రేక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.