edcet results 2021: ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 98.53 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత

author img

By

Published : Sep 24, 2021, 4:24 PM IST

Updated : Sep 24, 2021, 4:56 PM IST

edcet-results-telangana-2021-relesed

16:22 September 24

ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 98.53 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత

తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్​లో 98.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షలో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. అందులో 25,983 మంది అమ్మాయిలున్నట్టు వెల్లడించారు. 

ఎడ్‌సెట్‌లో నల్గొండకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్​కు మొదటి ర్యాంకు,  మంచిర్యాలకు చెందిన ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్‌ శర్మ మూడో ర్యాంకు సాధించారు. 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి: EDcet results 2021

Last Updated :Sep 24, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.