Tumbapalayam Earthquake: భూకంపం అనుకుని బయటకు పరుగులు తీశారు... కానీ.. !

author img

By

Published : Nov 23, 2021, 4:16 PM IST

Earthquake in putalapattu

Earthquake in putalapattu: ఏపీలోని పూతలపట్టు మండలంలో ఏర్పడిన వింత శబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

putalapattu Earthquake news: ఏపీలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా భయంతో వణికిపోయారు.

తుంబపాళ్యంలో వింత శబ్దాలు ఏర్పడడంతో ప్రజలు అది భూకంపంగా భావించారు. కానీ అది భూకంపం కాదని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో అప్పట్లో వందల సంఖ్యలో బోర్లు వేశారని.. వాటిలో నీరు లేకపోవడంతో అలాగే వదిలేశారని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఆ బోర్లలోకి నీరు వెళ్లడంతో ఈ శబ్దాలు సంభవించి ఉండొచ్చని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: High Tension at rangareddy collectorate: 'పోలీసులను అడ్డంపెట్టుకొని తెరాస గెలవాలని ప్రయత్నిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.