రాష్ట్రంలో నేటి నుంచి కేంద్రమంత్రుల పర్యటన..
Updated on: Sep 1, 2022, 6:25 AM IST

రాష్ట్రంలో నేటి నుంచి కేంద్రమంత్రుల పర్యటన..
Updated on: Sep 1, 2022, 6:25 AM IST
Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అందుతున్న విధానంపై ఆరా తీయనున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాల్లో పాల్గొననున్నారు.
Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు భాజపా వెల్లడించింది. మూడు, నాలుగో తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
పర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం సహా వారికి అందుతున్న విధానాన్ని కేంద్రమంత్రులు అడిగి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం గురించి తెలుసుకోనున్నట్లు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో వివిధ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
