జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరు

author img

By

Published : May 10, 2022, 2:11 PM IST

Updated : May 10, 2022, 2:52 PM IST

NSUI

14:08 May 10

18 మంది నాయకులకు బెయిల్ మంజూరు

జైలులో రిమాండ్​లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలకు బెయిల్ మంజూరైంది. రాష్ట్రంలో గత వారం కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ పర్యటన నేపథ్యంలో ఓయూలో ముఖాముఖికి అనుమతించాలని ఎన్​ఎస్​యూఐ నేతలు ఆందోళన చేయగా.. బల్మూరి వెంకట్‌ సహా 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిని చంచల్​గూడా జైల్​కు తరలించారు. ప్రస్తుతం రిమాండ్​లో ఉన్న ఆ 18 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించిన రాహుల్​గాంధీ.. జైల్​లో ఉన్న ఎన్​ఎస్​యూఐ నేతలతో ములాఖత్​ అయ్యారు. అధైర్యపడొద్దని... పార్టీ అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు. తెరాస, భాజపాతో పోరాటం ఆపొద్దని.. అండగా తానుంటానని కార్యకర్తలకు రాహుల్​ భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:

Last Updated :May 10, 2022, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.