స్పీకర్‌ పోచారం మనవరాలి వివాహం.. వేడుకలో పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్

author img

By

Published : Nov 21, 2021, 2:05 PM IST

Updated : Nov 21, 2021, 2:50 PM IST

kcr and jagan

13:34 November 21

పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్

స్పీకర్‌ పోచారం మనవరాలి వివాహం.. వేడుకలో పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్

శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్​, కేసీఆర్​ హాజరయ్యారు. శంషాబాద్​లో జరిగిన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, జగన్​ కాసేపు ముచ్చటించుకున్నారు.  

గతంలో దిల్లీలో జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇదే తొలిసారి. జలవివాదాలు మరోసారి తెరపైకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అనంతరం ఇరువురు సీఎంలు ఒకే వేదిక పంచుకోవడం విశేషం. ఈ వేడుకలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పలకరించుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి హాజరైన తెరాస లోక్​సభ పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు వధూవరులను ఆశీర్వదించారు.  

ఇదీచూడండి: CM KCR Delhi Tour: నేడు హస్తినకు సీఎం కేసీఆర్​.. అన్ని విషయాలు తేల్చుకునేందుకే..

Last Updated :Nov 21, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.