Amaravati padayatra today : 22వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహా పాదయాత్ర..

author img

By

Published : Nov 22, 2021, 9:38 AM IST

Amravati Farmers Maha Padayatra

ఏపీలో అమరావతి రైతుల మహాపాదయాత్ర(Amravati Farmers Maha Padayatra) ఉద్ధృతంగా సాగుతోంది. అదే జోరు, అదే హుషారు. పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు. నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం అందజేశారు. నేడు బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది.

ఏపీలో అమరావతి రైతుల మహాపాదయాత్ర(Amravati Farmers Maha Padayatra latest news) 22వ రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి కావలిలో బస చేసిన రైతులు నేడు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు కొనసాగనుంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర 21వ రోజు జైత్రయాత్రలా(21st day Amravati Farmers Maha Padayatra ) సాగింది. నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన యాత్రకు.. స్థానికులు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. జై అమరావతి నినాదాలతో మహాపాదయాత్ర చలంచర్ల మీదుగా సాగింది. యాత్రలో వెంకటేశ్వరస్వామి రథంతో పాటు.. అల్లా, జీసస్‌కు సంబంధించిన వాహనాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని రైతులు తెలిపారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

అమరావతి రైతులకు (Maha Padayatra Latest News) కొత్తపల్లిలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు. కావలిలో రైతులకు స్థానికులు పెద్దఎత్తున పూలతో ఘనస్వాగతం పలికారు. వర్షాలు, వరదలతో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. అమరావతికి మద్దతుగా రైతుల అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. 21వ రోజు యాత్ర 15 కిలోమీటర్లు సాగింది. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే రామారావు చేతుల మీదుగా చెక్ అందజేశారు.

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని..

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర (amaravathi farmers latest news) ముందుకు సాగుతోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్ర తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ఈ నెల ఒకటోతేదిన ప్రారంభమయ్యింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీలోని వైకాపా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. విశాఖను పరిపాల రాజధాని, అమరావతిని శాసన, కర్నూల్​ను న్యాయరాజధానిని చేస్తామంటూ ప్రకటించింది. దీనిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ రాజధాని పరిరక్షణ సమితి పేరిట ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. వీరికి అధికార వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి.

ఇదీ చదవండి: Amaravati Padayatra: మహా సంకల్పం... అమరావతి రైతుల 'మహా పాదయాత్ర' ప్రారంభం

Amaravati padayatra today : 21వ రోజుకు అమరావతి రైతుల మహా పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.