Tirupati Water Tank news : శుభ్రం చేస్తుండగా భూమిలో నుంచి పైకి తేలిన వాటర్​ట్యాంక్

author img

By

Published : Nov 26, 2021, 7:50 AM IST

tank, వాటర్ ట్యాంక్, తిరుపతిలో వాటర్ ట్యాంక్, water tank, water tank in Tirupati

Tirupati Water Tank news : ఏపీలోని తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. వరద ప్రభావం తగ్గిన అనంతరం కృష్ణానగర్​లో భూమిలో పాతిపెట్టిన నీటిట్యాంక్​ను శుభ్రం చేయడానికి ట్యాంక్​లోకి ఓ మహిళ దిగారు. ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ భూమిపైకి తేలడంతో ఆమె కంగారుపడ్డారు. ఈ వింత చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

Tirupati Water Tank news : నాలుగు రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్న తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో ఓ వింత చోటుచేసుకుంది. భూమి లోపల పాతిపెట్టిన నీటి ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా భూమి ఉపరితలం పైకి ఎగసి(tank raised from gourd at Tirupati) వచ్చింది. దాదాపు 25 అడుగుల విస్తీర్ణంతో 25 సిమెంట్ ఒరలతో నిర్మించిన నీటి తొట్టె బయటపడటం ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

శుభ్రం చేస్తున్న సమయంలో సిమెంటు ఒరలు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన మహిళ నీటి తొట్టెలో పడిపోయారు. వెంటనే ఆమెను నిచ్చెన సాయంతో బయటకు తీశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నీరు ప్రవహించడంతో ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన సిమెంటు ఒరలు 18 పైకి ఊబికి వచ్చినట్లు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.