నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటి..?

author img

By

Published : Aug 30, 2022, 9:54 PM IST

4 Women died in ibrahimpatnam government hospital family planning operation incident

Family Planning Surgery Incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న నలుగురు మృతిచెందడం కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ మిగతావారిని ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు డీహెచ్​ ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటీ..?

Family Planning Surgery Incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకున్న మహిళల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. మూడ్రోజుల తర్వాత కొందరు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత చికిత్సపొందతూ చనిపోయారు. సోమవారం మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ మృతిచెందారు. సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక చికిత్స పొందుతూ మరణించారు.

మహిళలు మృతిచెందటం కలకలం రేపటంతో వైద్యరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. శస్త్రచికిత్సలు జరిగే గదిని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆపరేషన్లు చేయించుకున్న మిగితా మహిళలను మళ్లీ పిలిపించి.. వారిలో ఇబ్బందులు ఉన్న కొందరిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో 11 మందికి, నిమ్స్‌లో 12మందికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణలు కమిటీని ప్రభుత్వం నియమించింది. పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడి లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు చేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ చేపడతామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదని డీహెచ్​.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు 38 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని వివరించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సాధారణంగా జరిగే ప్రక్రియన్న డీహెచ్‌... గతేడాది లక్షా 10 వేల చికిత్సలు చేసినట్లు పేర్కొన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. మహిళల మృతికి నిర్లక్ష్యమా..? లేక ఇతర కారణాలా..? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.