మార్కెట్లకు లాభాల పంట.. సెన్సెక్స్ 760 ప్లస్​

author img

By

Published : Jul 18, 2022, 3:41 PM IST

stock markets closing today

Stock Markets Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 760 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు లాభపడ్డాయి.

Stock Markets Closing: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 760 పాయింట్లు పెరిగి 54 వేల 521 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 16 వేల 278 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లో ఇవే.. ఇండస్​ఇండ్​, ఇన్ఫీ, టెక్​ మహీంద్రా, బజాబ్​, యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, టాటా స్టీల్​, సన్​ఫార్మా రాణించాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఎన్టీపీసీ, హెడ్​ఎఫ్​సీ, మారుతీ, డా.రెడ్డి డీలాపడ్డాయి.

రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 15 పైసలు నష్టపడి రూ.79.97 వద్ద స్థిరపడింది.

ఇవీ చదవండి: మరింత మైలేజ్ ఇచ్చేలా మారుతి 'బడ్జెట్'​ కార్ అప్డేట్.. రూ.4.5లక్షలక!

ఐటీ రిటర్న్స్​ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.