స్వల్పంగా పెరిగిన బంగారం.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Sep 29, 2022, 12:23 PM IST

gold rate

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.470 పెరిగి.. ప్రస్తుతం రూ.51,430గా ఉంది. కేజీ వెండి ధర రూ.1100 పెరిగి.. రూ.56,900 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,430గా ఉంది. కిలో వెండి ధర రూ.56,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,900గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,430గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,900 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.56,900 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,645 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.65 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,84,915 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,84,915
ఇథీరియంరూ.1,08,463
టెథర్​రూ.81.69
బినాన్స్​ కాయిన్​రూ.23,105
యూఎస్​డీ కాయిన్రూ.81.82

Stock Market Updates : అంతర్జాతీయ సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 40 పాయింట్లు లాభంతో 56,640 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 30 పాయింట్ల ఎగబాకి 16,890 దగ్గర ట్రేడవుతోంది. టాప్‌ 30 సూచీల్లో సన్​ఫార్మా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, టాటాస్టీల్​, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్​, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ: గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 35 పైసలు లాభపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 81.58కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.