స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. స్టాక్ మార్కెట్లకు ఫెడ్ భయాలు

author img

By

Published : Sep 22, 2022, 12:18 PM IST

GOLD RATE TODAY

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.170 పెరిగి ప్రస్తుతం రూ.51,270 గా ఉంది. కేజీ వెండి ధర రూ.410 పెరిగి ప్రస్తుతం రూ.58,280 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,270 గా ఉంది. కిలో వెండి ధర రూ.58,280 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,280 గా ఉంది.

Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,270 గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,280 వద్ద కొనసాగుతోంది.

Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,270 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,280 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1600 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.40 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ ధర రూ.4461 మేర పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,06,539 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,06,539
ఇథీరియంరూ.1,01,756
టెథర్రూ.80.56
బినాన్స్​ కాయిన్​రూ.21,375
యూఎస్​డీ కాయిన్రూ.80.62

Stock Market Updates : అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశంపై దృష్టిసారించిన మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం 484 పాయింట్లు పతనమై 58,973 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 137 పాయింట్లు దిగజారి.. 17,587 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి: సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, మారుతి, ఇండస్​ లాండ్ బ్యాంక్, హిందుస్థాన్​ యూనిలీవర్ లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫిన్​సెర్వ్, హెచ్​సీఎఫ్​సీ, విప్రో, హెచ్​సీఎఫ్​సీ బ్యాంక్, టెక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్​, ఐసీఐసీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 51 పైసలు దిగజారింది. ప్రస్తుతం రూపాయి విలువ 80.47 వద్ద ఉంది.

ఇవీ చదవండి: తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

డబ్బే డబ్బు.. అదానీ సంపాదన రోజుకు రూ.1,600 కోట్లు.. మొత్తం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.