భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే

author img

By

Published : Nov 24, 2022, 10:14 AM IST

gold rate today

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధర పెరిగింది. వెండి ధర భారీగా అధికమైంది. 10 గ్రాముల పసిడి ధర రూ.440‬ పెరగ్గా.. కేజీ వెండి ధర రూ.1,185‬ ఎగబాకింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ప్రస్తుతం రూ.54,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,200 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,400గా ఉంది. కిలో వెండి ధర రూ.64,200వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,400వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,200 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,400వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,200గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,756 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.58 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,62,871 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,62,871
ఇథీరియంరూ.97,973
టెథర్​రూ.81.60
బినాన్స్​ కాయిన్​రూ.24,443
యూఎస్​డీ కాయిన్రూ.81.70

స్టాక్​ మార్కెట్లు:
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 61,632 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 18,303 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

రూపాయి విలువ:
రూపాయి విలువ 26 పైసలు పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.67 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.