4 రాష్ట్రాల్లో మళ్లీ భాజపానే.. దూసుకెళ్లిన స్టాక్​ మార్కెట్​ సూచీలు!

author img

By

Published : Mar 10, 2022, 3:40 PM IST

Updated : Mar 10, 2022, 3:46 PM IST

stock markets

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 218 పాయింట్లు ఎగబాకింది.

Stock Market Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. తొలుత భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో కాస్త వెనక్కి తగ్గాయి. ఆరంభంలో 1600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​.. మార్కెట్​ ముగిసే సమయానికి 817 పాయింట్లు వృద్ధి చెంది 55,464కు చేరింది. మరోవైపు నిఫ్టీ 218 పాయింట్లు పెరిగి 16,563 వద్ద నిలిచింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో.. పంజాబ్​ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా సంకేతాలు వెలువడిన నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.

ఆటోమొబైల్​, రియల్ ​ఎస్టేట్​ రంగాలు పుంజుకోవడం కూడా.. లాభాల్లో కీలక పాత్ర పోషించాయి. వీటితో పాటు ఎఫ్​ఎంసీజీ, పబ్లిక్​ సెక్టార్​ బ్యాంక్స్​, బీఎస్​ఈ స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​ షేర్లు కూడా లాభాలు ఆర్జించాయి.

  • హిందుస్థాన్​ యూనిలివర్, టాటా స్టీల్​, గ్రేసిమ్, ఎస్​బీఐఎన్, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ షేర్లు లాభాలు గడించాయి. ​
  • మరోవైపు కోల్​ ఇండియా, టెక్​మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, ఓఎన్​జీసీ, టీసీఎస్​ షేర్లు నష్టపోయాయి.

ఉక్రెయిన్​- రష్యాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చల్లో పాల్గొనడం, చమురు ఉత్పత్తిని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యూఏఈ ప్రకటించడం ఇతర సానుకూలతలు.

ఇదీ చూడండి : త్వరలోనే మరో మెగా ఐపీఓ.. రూ.6,000- 7,500 కోట్లు టార్గెట్​!

Last Updated :Mar 10, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.