వారాంతపు సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన దేశీయ సూచీలు

author img

By

Published : Jan 14, 2022, 9:20 AM IST

Updated : Jan 14, 2022, 3:45 PM IST

stock market live updates

15:43 January 14

ఫ్లాట్​ ట్రేడింగ్​..

తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్​లో చివరకు ఫ్లాట్​గా ముగిశాయి దేశీయ సూచీలు. సెన్సెక్స్​ 12, నిఫ్టీ 2 చొప్పున నష్టపోయాయి.

సెన్సెక్స్​ 61 వేల 223 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల 256 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లో..

టీసీఎస్​, ఐఓసీ, ఇన్ఫోసిస్​, లార్సెన్​ అండ్​ టర్బో లాభాలు నమోదుచేశాయి.

ఏషియన్​ పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​యూఎల్​, యూపీఎల్​, ఓఎన్​జీసీ నష్టపోయాయి.

08:56 January 14

వారాంతపు సెషన్​లో ఫ్లాట్​గా ముగిసిన దేశీయ సూచీలు

స్టాక్​ మార్కెట్లు వారంతపు సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 60,827కి చేరింది. నిఫ్టీ 114 పాయింట్లు క్షీణించి 18143 వద్ద ట్రేడ్​ అవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, కరోనా కేసుల పెరుగుదల మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated :Jan 14, 2022, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.