stock market live: కోలుకుంటున్న సూచీలు- సెన్సెక్స్​ 200 ప్లస్​

author img

By

Published : Nov 23, 2021, 9:29 AM IST

Updated : Nov 23, 2021, 1:42 PM IST

stocks live

13:38 November 23

లాభాల్లోకి..

దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 250 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 58 వేల 700 ఎగువన ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో.. 17 వేల 520 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, కోల్​ ఇండియా, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​ అత్యధికంగా లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, ఇన్ఫోసిస్​, హెచ్​యూఎల్​, ఐసీఐసీఐ బ్యాంక్​ నష్టపోయాయి.

ఇవాళ ఆరంభ ట్రేడింగ్​లో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ దాదాపు 700 పాయింట్లు పతనమై కూడా తిరిగి పుంజుకోవడం విశేషం. 

12:02 November 23

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 50 పాయింట్లకుపైగా తగ్గి.. 58,411 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 17,421 వద్ద కొనసాగుతోంది.

09:46 November 23

భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ ​మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 58,358 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 17,404 వద్ద కొనసాగుతోంది.

08:55 November 23

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు (Stock Market) మంగళవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో సూచీలు డీలా పడ్డాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ ప్రస్తుతం 600 పాయింట్లకుపైగా తగ్గి.. 57,865 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 17,256 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30సూచీలో టాటాస్టీల్, పవర్​గ్రిడ్​, ఏషియన్ పెయింట్​షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. మిగిలినవి నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Nov 23, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.