మార్కెట్లు మళ్లీ పైపైకి.. సెన్సెక్స్​ 700, నిఫ్టీ 200 ప్లస్​

author img

By

Published : Mar 22, 2022, 3:36 PM IST

Stock Markets Live Updates, stock market closing

Stock Market Close: రిలయన్స్​, ఐటీ షేర్ల ఊతంతో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 697, నిఫ్టీ 198 పాయింట్ల మేర పెరిగాయి.

Stock Market Close: సోమవారం నష్టాల అనంతరం.. స్టాక్​ మార్కెట్లు మళ్లీ ఇవాళ్టి సెషన్​లో లాభాలు నమోదుచేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 697 పాయింట్ల పెరిగి 57 వేల 989 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 17 వేల 316 వద్ద సెషన్​ను ముగించింది.

రిలయన్స్​, ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

తొలుత దేశీయ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ముడిచమురు ధరల పెరుగుదల, ఆర్థిక, బ్యాంకింగ్​ షేర్లలో అమ్మకాలతో సెన్సెక్స్​ ఓ దశలో 360కిపైగా పాయింట్లు కోల్పోయి.. 56 వేల 930 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం.. మళ్లీ సూచీలు దూసుకెళ్లాయి.

లాభనష్టాల్లో ఇవే..

ఐటీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​ ఇండెక్స్​ ఒక శాతం మేర లాభపడింది. రియాల్టీ ఒక శాతం పడిపోయింది. బీఎస్​ఈ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ లాభాల్లోనే ముగిశాయి.

టెక్​ మహీంద్రా, బీపీసీఎల్​, టాటా మోటార్స్​, రిలయన్స్​, ఐఓసీ రాణించాయి.

హెచ్​యూఎల్​, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్​ మోటార్స్​ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: 10 నిమిషాల్లోనే జొమాటో డెలివరీ! రిస్క్ కాదా? క్వాలిటీ సంగతేంటి?

వంటింట్లో గ్యాస్​ మంట- భారీగా పెరిగిన సిలిండర్‌ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.